మార్కెట్ జోరుకు బ్రేక్​- సెన్సెక్స్​ 410 పాయింట్లు డౌన్​

author img

By

Published : Sep 28, 2021, 3:44 PM IST

Stocks close with loses

స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ (Sensex Today) 410 పాయింట్లు తగ్గి 59,700 దిగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 106 పాయింట్ల నష్టంతో 17,750 మార్క్​ కోల్పోయింది.

వరుస లాభాలతో రికార్డులు తిరగరాస్తూ ముందుకు సాగిన స్టాక్ మార్కెట్ల (Stock Markets today) జోరుకు.. మంగళవారం అడ్డుకట్ట పడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 410 పాయింట్లు కోల్పోయి 59,667 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 106 పాయింట్ల నష్టంతో 17,748 వద్దకు చేరింది.

మార్కెట్ల రికార్డు లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. రికార్డు స్థాయి వద్ద ఇలాంటి నష్టాలు సాధారణమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

టెలికాం, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా కుదేలయ్యాయి. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నా.. విద్యుత్ షేర్లు భారీగా పంజుకున్నాయి. ఫార్మా షేర్లు రాణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Share price)​ షేర్లు మళ్లీ జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 60,288 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,045 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,912 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,576 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టైటాన్​, కోటక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా) , హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి.

ఇదీ చదవండి: ధన్​ధనాధన్ 'రిలయన్స్'​-​ రూ.16లక్షల కోట్లకు ఎం-క్యాప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.