ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్గా సూచీలు
Updated on: Mar 11, 2022, 10:42 AM IST

ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్గా సూచీలు
Updated on: Mar 11, 2022, 10:42 AM IST
10:35 March 11
స్టాక్ మార్కెట్ల్ సూచీలు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఆతర్వాత లాభాల బట్టి 200 పాయింట్ల వరకు చెందాయి. మళ్లీ కాసేపటికే ఫ్లాట్గా మారాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 55,474 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 16,560 వద్ద కదలాడుతోంది.
09:43 March 11
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 216 పాయింట్లు వృద్ధి చెంది 55,680 కి చేరింది. నిఫ్టీ 58 పాయింట్లు మెరుగుపడి 16,653కి పెరిగింది.
09:17 March 11
stock market live updates
Stock Market News: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ సెన్సెక్స్ 116 పాయింట్లు కోల్పోయి 55,347కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి 16,554 వద్ద ట్రేడవుతోంది.
టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టాటా మోటార్స్, మారుతీ సుజుకి, నెస్లీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
