శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

author img

By

Published : Nov 25, 2021, 12:54 PM IST

Samsung India

ప్రముఖ టెక్​ సంస్థ శాంసంగ్(Samsung India)​.. నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. భారత్​లో వచ్చే ఏడాది క్యాంపస్​ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. 1000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు స్పష్టం చేసింది.

భారత్​లో కరోనా తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారుతున్న తరుణంలో టెక్‌ దిగ్గజం శాంసంగ్‌(Samsung India) కీలక ప్రకటన చేసింది. భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు(Samsung India recruitment) తెలిపింది. క్యాంపస్​ నియామకాల ద్వారా మొత్తం 1,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన పరిశోధన, అభివృద్ధి(ఆర్​ అండ్​ డీ) కేంద్రాల్లో కృత్రిమ మేధ, మెషిన్​ లెర్నింగ్​, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​(ఐఓటీ), డీప్​ లెర్నింగ్​, నెట్​వర్క్స్​, ఇమెజ్ ప్రాసెసింగ్​, డాటా అనాలసిస్​, కెమెరా టెక్నాలజీస్​ వంటి విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది.

"భారత్..​ కొన్నేళ్లుగా వేగవంతమైన ఆవిష్కరణ కేంద్రంగా ఉంది. భవిష్యత్​లో అవసరమైన పరిష్కారాల ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా వచ్చే ఏడాది 1000 మంది ఇంజనీర్లను నియమించాలని నిర్ణయించుకున్నాం. దేశంలోని ఐఐటీలు, బిట్స్​ పిలాని, ఎన్​ఐటీ సహా దిగ్గజ​ ఇంజనీరింగ్ కళాశాలను నుంచి వీరిని ఎంపిక చేయనున్నాం" అని శాంసంగ్ ఇండియా సీనియర్​ వైస్​ప్రెసిడెంట్​ సమీర్​ వాధవన్​ పేర్కొన్నారు.

2017, 2018ల్లో 1,000 మంది చొప్పున ఉద్యోగులను నియమించింది శాంసంగ్. 2019లో మొత్తం 1200 మందిని ఉద్యోగవకాశాలు కల్పించింది. అయితే కరోనా కారణంగా కొందరు ఆలస్యంగా చేరితే.. మరికొందరు 2021లో చేరారని కంపెనీ తెలిపింది.

ఇదీ చూడండి: ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.