Gold Price today: పెరిగిన పసిడి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Nov 26, 2021, 10:12 AM IST

Gold Price today

బంగారం ధర (Gold price Today) స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.200 మేర ఎగసి.. 49 వేల 419కి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు (Silver price today) ఇలా ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. శుక్రవారం రూ.200 మేర పెరిగి.. పది గ్రాముల మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.49,419 వద్ద ఉంది. వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకోగా.. కిలో వెండి ధర (Silver price today)రూ.180 పెరిగి.. రూ.65,210కు చేరింది.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Hyderabad) రూ.49,419 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,210 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold Price in Vijayawada) ధర రూ.49,419గా ఉంది. కిలో వెండి ధర రూ.65,210 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.49,419గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,210 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,798 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.59 డాలర్లు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎటువంటి మార్పులేదు

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: బిట్​కాయిన్​పై 'బేర్' పంజా.. ప్రభుత్వ నియంత్రణే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.