Fuel Price Today: మరోసారి పెరిగిన చమురు ధరలు

author img

By

Published : Sep 27, 2021, 9:45 AM IST

fuel prices today

దేశంలో ఇంధన​ ధరలు మరోసారి (Fuel Price Today) పెరిగాయి. లీటర్ డీజిల్​పై 24 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

దేశంలో డీజిల్​ ధరల పెంపు కొనసాగుతోంది. సోమవారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ డీజిల్​ ధర రూ. 89.33కు చేరుకుంది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర (Mumbai Diesel Price Today) 25 పైసలు పెరిగి రూ. 96.9కు చేరగా.. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.27 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ డీజిల్​పై (Kolkata Today Diesel Price) 24 పైసలు పెరగడం వల్ల ధర రూ. 92.38కు చేరింది. లీటర్​ పెట్రోల్​ రూ.101.64గా ఉంది.
  • చెన్నైలో లీటర్​ డీజిల్​ 23 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి రూ. 93.90 వద్ద కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​ 98.97గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.43 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.97.90 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉంది.
  • గుంటూరులో డీజిల్​ లీటర్​పై 25 పైసలు పెరిగి.. రూ.99.13 వద్దకు చేరింది. పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది.

ఇదీ చూడండి : ఎలక్ట్రిక్​ వాహనం కొనాలా? అయితే మీకో గుడ్​ న్యూస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.