నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Sep 16, 2022, 4:33 PM IST

Updated : Sep 16, 2022, 5:26 PM IST

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

14:35 September 16

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత

  • The media is being misled by the malicious propaganda of people sitting in Delhi. I request all the media houses to rather utilise your time in showing the truth.
    To save some precious time of the TV viewers, I would like to clarify that I have not received any notice.

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత స్పష్టం చేశారు. దిల్లీలో కూర్చుని కొందరు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీడియా తమ సమయాన్ని నిజాలను చూపించేందుకు ఉపయోగించాలని కోరారు.

దిల్లీలో కూర్చొని కొందరు కావాలనే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించాలని నేను అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నా.-ట్విటర్​లో ఎమ్మెల్సీ కవిత

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ సోదాలు

Last Updated :Sep 16, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.