గుడిసెలో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Jan 28, 2022, 10:45 PM IST

Woman Gangrape

Woman Gangrape: గుడిసెలో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్​ ఝాలావాడ్​ జిల్లాలో ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Woman Gangrape: రాజస్థాన్ ఝాలావాడ్​ జిల్లాలో 40ఏళ్ల మహిళపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది

బాధితురాలు.. బకానీ పోలీసు స్టేషన్​ పరిధిలో నివాసముంటోంది. పొలంలో నిర్మించుకున్న గుడిసెలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించారు. అయితే ఆమె భర్త ఇంటికి వచ్చిన తర్వాత.. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఇద్దరు చిన్నారుల దారుణ హత్య.. కనుగుడ్లు తీసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.