భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Sep 25, 2022, 11:40 AM IST

Woman gang raped by five in Barabanki

తెలిసినవారే కదా అని నమ్మి వచ్చిన ఓ మహిళపై గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు ఐదుగురు యువకులు. బెదిరింపులకు బయపడి ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. ఆఖరికి ధైర్యం చేసుకుని భర్తకు చెప్పింది. దీంతో అసలు విషయం బయటపడింది.

ఉత్తరప్రదేశ్​లోని బరాబంకీ జిల్లాలో ఓ మహిళపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబర్​ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది: పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బదోస్​రాయ్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు స్థానిక యువకుడు మొబైల్​ ఫోన్​ ఇచ్చాడు. అప్పటినుంచి తరచూ ఆమె ఆ యువకుడితో ఫోన్​లో మాట్లాడుతూ ఉండేది. సెప్టెంబర్​ 17న ఆ యువకుడు మహిళ ఇంటికి వచ్చాడు. భర్త పిలుస్తున్నాడని మహిళకు అబద్ధం చెప్పి.. ఆమెను వెంట తీసుకెళ్లాడు.

గ్రామ శివారుకు వెళ్లాక ఆ యువకుడితో పాటు మరో నలుగురు యువకులు ఉన్నారు. బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహ వచ్చిన బాధితురాలు ఇంటి చేరుకుంది. మొదట ఈ ఘటన గురించి ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత ధైర్యం చేసుకుని భర్తకు చెప్పింది. సెప్టెంబర్​ 23న పోలీస్​ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసును పరిశీలించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త ఇంటిపై పెట్రోల్​ బాంబ్ దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.