స్కూళ్లలోకి ఆ పిల్లలకు నో ఎంట్రీ- ప్రభుత్వం హెచ్చరిక!

author img

By

Published : Jan 15, 2022, 5:14 PM IST

Unvaccinated children won't be allowed to enter schools

Unvaccinated Children: వ్యాక్సిన్​ తీసుకోని 15-18 ఏళ్ల పిల్లలను స్కూళ్లకు అనుమతించబోమని స్పష్టం చేసింది హరియాణా ప్రభుత్వం. కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగాల్​, జమ్ముకశ్మీర్​, అసోం ప్రభుత్వాలు మరోసారి కఠిన ఆంక్షలకు సిద్ధమయ్యాయి.

Unvaccinated Children: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల నైట్​ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. వ్యాక్సినేషన్​పైనా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

దేశంలో 15-18 ఏళ్ల వయస్కులకు కూడా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని పిల్లలను పాఠశాలలోకి అనుమతించబోమని ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండగా.. తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​.

hariyana school children
హరియాణా మంత్రి అనిల్​ విజ్​ ట్వీట్​

హరియాణాలో మొత్తం 15 లక్షలకుపైగా అర్హులైన పిల్లలు టీకా తీసుకోవాల్సి ఉంది. వారంతా వ్యాక్సిన్​ తీసుకునేలా ప్రోత్సహించాలని.. పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు విజ్​.

Bengal extends COVID-19 restrictions

బంగాల్​లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్​-19 ఆంక్షలను జనవరి 31వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహాది శుభ కార్యక్రమాలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. పెళ్లిళ్లకు గరిష్ఠంగా 200 మంది హాజరుకావొచ్చని స్పష్టం చేసింది.

అసోంలో కఠిన ఆంక్షలు..

వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకోనివారు బయట తిరగొద్దని స్పష్టం చేసింది అసోం ప్రభుత్వం. జిల్లా కోర్టులు, హోటళ్లు, మార్కెట్లు వంటి ప్రదేశాల్లో వారికి అనుమతి ఉండదని తేల్చిచెప్పింది.

రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించే అవకాశం లేదని, మాస్కు మాత్రం తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.

JK Weekend Restrictions

కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్​ యంత్రాంగం అప్రమత్తమైంది. వారాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. మార్కెట్లను మూసివేయించి.. వ్యాపారులను ఇళ్లకు పంపించారు అధికారులు. మరోవైపు.. విద్యా సంస్థలు ఆన్​లైన్​లోనే బోధన సాగించాలని సూచించింది జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం.

జమ్ముకశ్మీర్​లో శుక్రవారం రికార్డు స్థాయిలో 2,456 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,52,623కు చేరింది. మరణాలు 4,557గా ఉన్నాయి.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. 2,68,833 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid-19 Vaccination: దేశంలో 2021 జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్‌ డోసులను అందిస్తుండగా.. భారత్‌ కూడా ప్రికాషన్‌ డోసులను వడివడిగా వేస్తోంది.

భారత్​లో ఇప్పటివరకు 155 కోట్లకుపైగా టీకా డోసులను లబ్ధిదారులకు అందించింది కేంద్రం.

ఇవీ చూడండి: వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?

హాస్టల్​లో ఒకేసారి 50మంది విద్యార్థులకు అస్వస్థత- ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.