భాజపాకు షాక్​.. కాంగ్రెస్​లోకి ఉత్తరాఖండ్​ మంత్రి

author img

By

Published : Oct 11, 2021, 4:07 PM IST

yashpal arya

ఉత్తరాఖండ్​లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా రాజీనామా చేసిన సీనియర్​ నేత యశ్​పాల్​ ఆర్య (Yashpal Arya News).. ఆయన కుమారుడితో కలిసి కాంగ్రెస్​లో చేరారు.

ఉత్తరాఖండ్ రవాణా శాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య (Yashpal Arya News) కాంగ్రెస్​లో చేరారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన యశ్​పాల్​.. సీనియర్​ నేతలు హరీశ్​ రావత్​, కేసీ వేణుగోపాల్​ తదితరుల సమక్షంలో ఆయన కుమారుడు సంజీవ్​తో (Yashpal Arya Sanjeev Arya) పాటు ఆ పార్టీలో చేరారు. దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో యశ్​పాల్ సోమవారం కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ​

అంతకుముందు.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీతో ఆయన నివాసంలో యశ్​పాల్​ (Yashpal Arya News) భేటీ అయ్యారు. యశ్​పాల్​ ఆర్య, ఆయన కుమారుడు (Yashpal Arya Sanjeev Arya) తిరిగి కాంగ్రెస్​లో చేరడం.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​కే విజయ అవకాశాలు ఎక్కువున్నాయనేందుకు సంకేతమని సీనియర్​ నేత కేసీ వేణుగోపాల్​ వ్యాఖ్యానించారు.

ఆరు టికెట్లు..

సొంతగూటికి చేరుకున్న యశ్​పాల్​.. రానున్న ఎన్నికల్లో తన వర్గానికి 6 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్​ అధిష్ఠానాన్ని డిమాండ్​ చేశారని.. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని సమాచారం.

నాలుగేళ్లలో...

2017లో యశ్‌పాల్ ఆర్య కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా భాజపాలో చేరారు. ప్రస్తుతం బజ్​పుర్​ ఎమ్మెల్యేగా యశ్​పాల్, నైనితాల్ ఎమ్మెల్యేగా ఆయన కుమారుడు సంజీవ్​ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.​ యశ్​పాల్​​​.. ఆరుసార్లు ఎమ్మెల్యే పదవి చేపట్టిన ఎస్సీ నేతగా గుర్తింపు పొందారు.

2022 ఎన్నికల ముందు యశ్​పాల్​ పార్టీని వీడటం వల్ల భాజపాకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

ఇదీ చూడండి : ఉగ్రవాద కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.