త్రిపుర స్థానికల సంస్థల పోరుకు సర్వం సిద్ధం- బరిలో 785 మంది

author img

By

Published : Nov 25, 2021, 5:39 AM IST

tripura local body election

త్రిపురలో నేడు 20 స్థానిక సంస్థలకు ఎన్నికలు (Tripura Civic Polls) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

త్రిపురలో నేడు (గురువారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు (Tripura Civic Polls) సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 785 మంది అభ్యర్థులు పోటీచేయనున్నారు. 770 పోలింగ్​ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు (Tripura Civic Polls) కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఈనెల 28న (ఆదివారం) ఉదయం 8 గంటలకు జరగనుంది.

పార్టీ-పోటీ చేస్తున్న స్థానాలు

  • తృణమూల్​ కాంగ్రెస్​- 120
  • భాజపా-334
  • సీపీఐ-6
  • సీపీఐ(ఎం)-197
  • కాంగ్రెస్-92
  • రెవల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీ- 2
  • ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​-3
  • ఇతరులు-10
  • స్వతంత్రులు -21

ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు (Tripura Civic Polls) అన్ని విధాల భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు వెల్లడించారు. 644 పోలింగ్​ కేంద్రాల్లో 370 కేంద్రాలను కేటగిరీ ఏ, 274 కేంద్రాలను కేటగిరీ బీ కింద విభజించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

అంతకుముందు.. 36 స్థానాల్లో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్​ను ఉపసంహరించుకున్నారు.

  • 20 స్థానిక సంస్థలకు ఉన్న 334 నియోజకవర్గాల్లో 8 స్థానాలు ఎస్​టీలకు, 85 స్థానాలు ఎస్​సీలకు, 157 స్థానాలు మహిళలకు రిజర్వేషన్​ ఉంది.
  • ఈ ఎన్నికల్లో మొత్తం 5,94,772 ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా మహిళా ఓటర్లే ఉండటం గమనార్హం. 2,93,979 మంది పురుషులు ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 3,00,777గా ఉంది. ఇతరుల సంఖ్య 16గా ఉంది.

ఇదీ చూడండి : మోదీతో దీదీ భేటీ.. ఆ నిర్ణయం వాపస్ తీసుకోవాలని విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.