'స్పుత్నిక్​ లైట్'​ మూడోదశ ట్రయల్స్​కు డీసీజీఐ ఆమోదం

author img

By

Published : Sep 15, 2021, 2:32 PM IST

Sputnik's single-dose

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​ లైట్​ టీకా మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​కు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​.. దేశంలోని ఇతర రెండు డోసుల టీకాల కంటే సమర్థవంతంగా పనిచేస్తోందని లాన్సెట్​లో ఓ అధ్యయనం ప్రచురితమైన తరువాత డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్​ లైట్​ వ్యాక్సిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ చేపట్టేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. కొవిడ్​కు వ్యతిరేకంగా ఈ టీకా 78.7 శాతం నుంచి 83.7 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవల లాన్సెట్​ ఓ అధ్యయనం ప్రచురించింది. ఈ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు డోసుల టీకాల కంటే గొప్పగా పని చేస్తుందని పేర్కొంది. ఈ ప్రచురణ అనంతరం ట్రయల్స్​కు డీసీజీఐ ఆమోదం లభించింది.

అయితే జులైలోనే మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​​ నిర్వహించడానికి స్పుత్నిక్​ మొగ్గు చూపినా... నిపుణుల కమిటీ ఆమోదం తెలపలేదు. అంతేగాకుండా అత్యవసర వినియోగానికి నిరాకరించింది. అయితే భారత్​లో దీని పనితీరు, ప్రభావం ఎలా ఉంటుందని ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్ ద్వారా నిపుణులు గుర్తించారు.

97.2 శాతం సమర్థవంతం..

స్పుత్నిక్​ వీ టీకా 97.2 శాతం సమర్థవంతంగా పని చేసిందని బెలారస్ ఆరోగ్య శాఖ తెలిపినట్లు స్పుత్నిక్‌ వీ తయారీ సంస్థ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) పేర్కొంది.

ఇదీ చూడండి: Corona cases in India: దేశంలో కొత్తగా 27వేల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.