టీకా తీసుకుంటే రూ.50 వేల స్మార్ట్​ఫోన్ ఫ్రీ- ఆఫర్​ వారమే!

author img

By

Published : Dec 5, 2021, 9:30 AM IST

VACCINATION SMART PHONES

Vaccination Smartphone gift: రెండో డోసు టీకా తీసుకుంటే రూ. 50 వేల విలువ చేసే స్మార్ట్​ఫోన్​ను ఉచితంగా అందించనున్నట్లు రాజ్​కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. లబ్ధిదారులతో పాటు టీకా కేంద్రాలకూ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Rajkot Municipal Corporation news: కరోనా కట్టడిలో భాగంగా గుజరాత్​లోని రాజ్​కోట్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో డోసు టీకా తీసుకోనివారే లక్ష్యంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య రెండో డోసు తీసుకున్న లబ్ధిదారులకు స్మార్ట్​ఫోన్ అందించనున్నట్లు ప్రకటించింది.

VACCINATION SMART PHONES
రాజ్​కోట్​లోని ఓ టీకా కేంద్రం

Vaccination incentives Rajkot:

డ్రా నిర్వహించి ఒక లక్కీ విన్నర్​ను ఎంపిక చేయనున్నట్లు రాజ్​కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమిత్ అరోడా తెలిపారు. విజేతకు రూ.50 వేల విలువైన స్మార్ట్​ఫోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

VACCINATION SMART PHONES
టీకా తీసుకుంటున్న లబ్ధిదారు

లబ్ధిదారులతో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లకు సైతం నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు అమిత్ వెల్లడించారు. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య ఎక్కువ డోసులు అందించే అర్బన్ హెల్త్​కేర్ సెంటర్​లకు రూ.21 వేలు అందిస్తామని తెలిపారు. రెండో డోసు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: మహిళా ఎమ్మెల్యేపై సీఎం అనుచిత వ్యాఖ్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.