నీట్​ పీజీ పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం

author img

By

Published : May 13, 2022, 1:11 PM IST

SC refuses to entertain postpone NEET-PG-22 examination, says would affect patient care

NEET-PG Exam: నీట్​ పీజీ-2022 పరీక్ష వాయిదా వేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్​ వేశారు వైద్యులు. అయితే.. వారి అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వాయిదాతో రోగుల సేవలో ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేసింది.

NEET-PG Exam: నీట్ పీజీ​- 2022 పరీక్షను వాయిదా వేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ సూర్య కాంత్​ సభ్యులుగా గల ధర్మాసనం పేర్కొంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.

''విద్యార్థుల్లో రెండు కేటగిరీల వారు ఉన్నారు. ఓ వర్గం వాయిదా వేయాలని కోరుతోంది. పరీక్ష కోసం సన్నద్ధమైన 2 లక్షల 6 వేల మంది విద్యార్థులున్న మరో పెద్ద వర్గానికి నష్టం జరుగుతుంది. కరోనా కారణంగా పరీక్షల షెడ్యూల్​ ప్రభావితమైంది. దానిని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.''

- సుప్రీం కోర్టు ధర్మాసనం

నీట్​ పీజీ పరీక్ష ఈ నెల 21న జరగాల్సి ఉంది. అయితే.. నీట్​ పీజీ- 2021 కౌన్సెలింగ్​ ఇంకా జరుగుతుందని, అందులో సీటు దక్కని విద్యార్థులు నీట్​-పీజీ 2022కు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించాలని కోరుతున్నారు. అందుకు అనుగుణంగా పరీక్ష వాయిదా వేయాలని కొందరు వైద్యుల బృందం ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. విచారణకు మే 10న అంగీకరించింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా.. వారి అభ్యర్థనను తిరస్కరించింది. పరీక్ష వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయను కూడా విజ్ఞప్తి చేసింది భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ).

ఇవీ చూడండి: జేఈఈ పరీక్ష వాయిదా.. నీట్ తేదీ ఖరారు

నీట్​ రిజర్వేషన్.. మెరిట్​కు విరుద్ధం కాదు: సుప్రీం కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.