'రేప్​ చేసిన వ్యక్తితోనే పెళ్లి'కి సుప్రీం నో!

author img

By

Published : Aug 2, 2021, 3:13 PM IST

SC dismisses plea of rape survivor

అత్యాచార బాధితురాలి పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. నేరానికి పాల్పడిన వ్యక్తిని పెళ్లి చేసుకునే విషయంలో తాము కలుగజేసుకోబోమని స్పష్టం చేసింది. ట్రయల్​ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించింది. మరోవైపు.. నేరస్థుడి బెయిల్​ పిటిషన్​ను సైతం తిరస్కరించింది.

తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ కేరళకు చెందిన బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. మరోవైపు.. ఈ కేసులో దోషిగా తేలిన మాజీ చర్చి అధికారి.. బాధితురాలిని వివాహం చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన​ పిటిషన్​ను సైతం తోసిపుచ్చింది.

ఇరువురి పిటిషన్​లు పరిశీలించిన జస్టిస్​ వినీత్​ శరణ్​, జస్టిస్​ దినేశ్​ మహేశ్వరితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఈ కేసులో హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అందులో మేము కలుగజేసుకోవాలనుకోవట్లేదు.' అని పేర్కొంది. అయితే.. అత్యాచారానికి పాల్పడిన మాజీ మతాధికారిని వివాహం చేసుకునే విషయమై.. ట్రయల్​ కోర్టును ఆశ్రయించేందుకు బాధితురాలికి అవకాశం కల్పించింది ధర్మాసనం.

వివాహానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, అది ప్రాథమిక హక్కు అని దోషి తరఫు న్యాయవాది అమిత్​ జార్జ్​ ధర్మాసనానికి తెలిపారు. అయితే.. బాధితురాలు, దోషి వయసు ఎంత అని జార్జ్​ను ప్రశ్నించింది ధర్మాసనం. దోషికి 49 ఏళ్లు కాగా.. బాధితురాలికి 25 ఏళ్ల వరకు ఉంటాయని తెలిపారు.

కేరళ, కొట్టియూర్​కు చెందిన మైనర్​పై ఓ చర్చి అధికారి అత్యాచారం చేశాడు. దోషిగా తేలిన క్రమంలో హైకోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే.. అత్యాచార బాధితురాలు గర్భం దాల్చి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వివాహం చేసుకునేందుకు బాధితురాలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

బాధితురాలని వివాహం చేసుకునేందుకు బెయిల్​ కోరుతూ.. దోషి దాఖలు చేసిన పిటిషన్​ను ఈ ఏడాది ఫిబ్రవరి 16న కేరళ హైకోర్టు తిరస్కరించింది.

ఇదీ చూడండి: '66-ఏ'పై రాష్ట్రాలు, హైకోర్టులకు సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.