డిసెంబర్​ 6న భారత్​కు పుతిన్.. మోదీతో కీలక చర్చలు

author img

By

Published : Nov 26, 2021, 5:33 PM IST

Updated : Nov 26, 2021, 5:58 PM IST

Putin visit india

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ డిసెంబర్​ 6న భారత్​కు(Putin india visit) రానున్నారు. 21వ రష్యా-భారత్​ వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. మరోవైపు.. డిసెంబరు 6న భారత్​, రష్యా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల మధ్య 2 ప్లస్​ 2 భేటీ జరగనుంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు 6న భారత పర్యటనకు రానున్నారు. 21వ భారత్-రష్యా వార్షిక సదస్సు(India-russia annual summit 2021) కోసం ఆయన దిల్లీ చేరుకోనున్నారు. ప్రధానమంత్రి మోదీతో కలిసి(Putin with modi) దిల్లీలో జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ఈ వార్షిక సదస్సులో భాగంగా భారత్​, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై(India russia relations) ఇరు దేశాల ప్రతినిధులు కీలక చర్చలు జరుపుతారు. గతేడాది కరోనా కారణంగా ఈ సదస్సు వాయిదా పడింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 సార్లు ఈ సదస్సు జరిగింది.

2 ప్లస్​ 2 భేటీ..

భారత్​, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల తొలి 2 ప్లస్ 2 సమావేశం(Russia india two plus two ministerial meeting) డిసెంబరు 6న జరగనుందని అరిందమ్ బాగ్చి తెలిపారు. "భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్​ ఈ భేటీకి హాజరవుతుండగా.. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్​ లావ్​రోవ్​, రక్షణ శాఖ మంత్రి సెర్గెయ్​ షోయిగు పాల్గొంటారు. వారు డిసెంబరు 5-6 మధ్య భారత్​లో పర్యటించనున్నారు" అని వివరించారు.

ఇదీ చూడండి: న్యాయవ్యవస్థ రక్షణకు సహకరించండి: జస్టిస్ రమణ

Last Updated :Nov 26, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.