లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

author img

By

Published : May 12, 2022, 12:16 PM IST

Road Accident in Maharashtra

Road Accident in Maharashtra: 60 అడుగుల లోయలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. వివాహానికి హాజరై వస్తూ ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. యూపీలో జరిగిన మరో ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

Road Accident in Maharashtra: మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు, వారి మేనల్లుడు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు.
ఈ సంఘటన మసోబా వాడి ఫటా గ్రామానికి సమీపంలో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు సతీశ్​ పంజుమల్​ టెక్వానీ(58) ఆయన ఇద్దరు సోదరులు శంకర్​(46), సునీల్​(48), మేనల్లుడు లఖన్​ మహేశ్​ టెక్వానీగా (20) గుర్తించారు. వారంతా బీడ్​ నగరం నుంచి అహ్మద్​నగర్​ జిల్లా కేంద్రానికి వెళ్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు.

వివాహానికి హాజరై వస్తుండగా: ఝార్ఖండ్​ సరాయ్​కేలా ఖర్సావాన్​ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాండిల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చిల్గు పూలియా ప్రాంతంలో ఓ పికప్​ వ్యాన్​ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జంషెడ్​పుర్​ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఉర్మాల్​ గ్రామానికి చెందిన వారు వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Road Accident
డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడిన వ్యాన్​

యమునా ఎక్స్​ప్రెస్​ వేపై ఐదుగురు మృతి: ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నోయిడాలో యమునా ఎక్స్​ప్రేస్​ వేపై గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అందులో నలుగురు మహారాష్ట్ర, ఒకరు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారితో పాటు ఎస్​యూవీ వాహనంలో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 'మహీంద్రా బొలెరోలో ఏడుగురు ఆగ్రా నుంచి నోయిడా వైపునకు వెళ్తున్నారు. జెవార్​ టోల్​ ప్లాజాకు సమీపంలో డంపర్​ ట్రక్కును ఢీకొట్టారు.' అని గౌతమ్​ బుద్ధ నగర్​ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Road Accident in Maharashtra
ట్రక్కును ఢీకొట్టిన బొలెరో

ఇదీ చూడండి: రోడ్డు దాటుతూ బైకర్​పై నుంచి జింక హైజంప్​.. ఒక్క కిక్​తో..

కుమారుడికి గుడి కట్టిన తల్లిదండ్రులు.. నిత్యం పూజలు చేస్తూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.