రైలు పట్టాలపై కాంక్రీట్ స్తంభం- కుట్రపూరితంగానే..!

author img

By

Published : Jan 15, 2022, 10:43 AM IST

Rajdhani Express Accident in Gujarat

Rajdhani Express Accident in Gujarat: రైలు పట్టాలపై కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా కాంక్రీట్​ స్తంభాన్ని పడేశారు. రాజధాని ఎక్స్​ప్రెస్​ వేగంగా దానిపై నుంచే దూసుకెళ్లగా.. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది. గుజరాత్​ వల్సాద్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై రైల్వే పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Rajdhani Express Accident in Gujarat: ముంబయి-దిల్లీ రాజధాని ఎక్స్​ప్రెస్​కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తప్పేలా చేయాలన్న దురుద్దేశంతో కొందరు దుండగులు ట్రాక్​పై కాంక్రీట్ స్తంభాన్ని వేసినా.. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగలేదు.

railway track Accidents
రైలు పట్టాలపై పడేసిన సిమెంట్ పిల్లర్​

ఏం జరిగింది?

Railway Track Accident News: ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్​ప్రెస్​.. శుక్రవారం రాత్రి 7.10గంటలకు గుజరాత్​ వల్సాద్​ జిల్లాలోని అతుల్​ స్టేషన్​కు సమీపంలో ప్రయాణిస్తోంది. ఫెన్సింగ్​ వేసేందుకు ఉపయోగించే కాంక్రీట్ స్తంభం ఒకటి.. రైలు లోకోపైలట్​కు ఆ సమయంలో పట్టాలపై కనిపించింది. దానిపై నుంచే రైలు దూసుకెళ్లగా.. ఆ స్తంభం విరిగి పట్టాల పక్కన పడిపోయింది. వెంటనే లోకోపైలట్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.

railway track Accidents
రైలు రాకతో విరిగిపడిన కాంక్రీట్​ స్తంభం
రైల్వే పోలీసు విభాగంలోని సీనియర్ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలును ప్రమాదానికి గురయ్యేలా చేయాలన్న కుట్రతోనే ఎవరో ఇలా చేశారని అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులపై వల్సాద్ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసి.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
railway track Accidents
నిందితుని కోసం పోలీసుల గాలింపు
railway track Accidents
దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇదీ చదవండి: 'ఆమెపై గ్యాంగ్​రేప్​ జరగలేదు.. కానీ జననాంగాలపై తీవ్ర గాయాలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.