'ఇకపై జాగ్రత్తగా ఉంటా'.. ఈడీ అధికారులకు రాహుల్ క్షమాపణ!

author img

By

Published : Jun 14, 2022, 10:30 AM IST

Updated : Jun 14, 2022, 10:54 AM IST

RAHUL ED SORRY

10:26 June 14

'ఇకపై జాగ్రత్తగా ఉంటా'.. ఈడీ అధికారులకు రాహుల్ క్షమాపణ!

RAHUL ED SORRY: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులకు క్షమాపణ చెప్పారు. సోమవారం ఈడీ విచారణకు హాజరైన ఆయన... లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

సోమవారం ఏం జరిగిందంటే...?
ఈడీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 8.30గంటలకే రాహుల్‌ గాంధీ తొలిరోజు విచారణ ముగిసింది. రెండు దఫాలుగా జరిగిన విచారణలో రాహుల్ గాంధీ ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లాయి. న్యాయవాది సలహా మేరకు వాటిని సరిచేసి, సంతకం చేసేందుకు రాహుల్ సమయం తీసుకున్నారు. ఈడీ అధికారులు నమోదు చేసిన స్టేట్‌మెంట్‌ను కూడా రాహుల్‌ గాంధీ చూసి, ఆమోదించిన తర్వాతే కార్యాలయం నుంచి బయటికి వచ్చారు.

అప్పుడే క్షమాపణ!
ఈ కారణంగానే రాహుల్ గాంధీ ఈడీ ప్రధాన కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు ఉన్నారు. తన రాతపూర్వక సమాధానాల్లో తప్పులు దొర్లిన చోట్ల మార్పులు చేస్తున్న సమయంలో ఈడీ అధికారులకు రాహుల్‌ పలుమార్లు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. మంగళవారం వాంగ్మూలం నమోదు చేసే సమయంలో... జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఈడీ అధికారులతో రాహుల్‌ అన్నట్లు సమాచారం. పీఎంఎల్ఏ చట్టం ప్రకారమే లిఖిత పూర్వక, వ్యక్తిగత వాగ్మూలం నమోదు చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీకి ఈడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈడీ విచారణకు రాహుల్​ గాంధీ హాజరు.. దిల్లీలో యుద్ధ వాతావరణం

Last Updated :Jun 14, 2022, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.