పంజాబ్​ ఎన్నికలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్​- సోనూ​ సోదరికి టికెట్​

author img

By

Published : Jan 15, 2022, 3:23 PM IST

Updated : Jan 15, 2022, 4:12 PM IST

punjab

Punjab Election 2022: పంజాబ్​ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్​ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ నటుడు సోనూసూద్​ సోదరి మాళవికా సూద్​కు చోటు దక్కింది.

Punjab Election 2022: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. మొత్తం 86 సీట్లకు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. ఛామ్​కౌర్​ సాహిబ్​ ఎస్​సీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ, అమృతసర్​ ఈస్ట్​ నుంచి పంజాబ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు నవజోత్​ సింగ్​ సిద్ధూ ఎన్నికల బరిలో దిగనున్నారు.

Punjab Election 2022
కాంగ్రెస్​ ప్రకటించిన అభ్యర్థుల జాబితా
Punjab Election 2022
తొలి జాబితాలో 86 మంది అభ్యర్థులు
Punjab Election 2022
పంజాబ్​ ఎన్నికలకు కాంగ్రెస్​ అభ్యర్థులు

Sonusood sister Congress ticket

ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ప్రముఖ నటుడు సోనూసోద్​ సోదరి మాళవికా సూద్​కు కూడా కాంగ్రెస్​ టికెట్​ ఖరారు చేసింది. మోగ నియోజకవర్గం అభ్యర్థిగా ఆమెను ఎన్నికల బరిలో నిలిపింది. క్వాడియన్​ నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యుడు ప్రతాప్​ సింగ్​ బాజ్వాను, సింగర్​ సిద్ధూ మూసేవాలాను మన్సా నియోజవర్గానికి అభ్యర్థులుగా ఖరారు చేసింది.

డిప్యూటీ సీఎంలు సుఖజీందర్​ సింగ్​ రంధవా, ఓం ప్రకాశ్​ సోనీని ప్రస్తుతం వారి ప్రాతినిధ్యం వహిస్తున్న డేరా బాబా నానక్​, అమృత్​సర్​ సెంట్రల్​ నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీకి దింపుతోంది.

వారసులు..

పటియాలా రూరల్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్​ మంత్రి బ్రహ్మ్​ మహీంద్రా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ స్థానంలో ఆయన కుమారుడు మోహిత్​ మహీంద్రా బరిలోకి దిగనున్నారు. మరోవైపు పంజాబ్​ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చీఫ్​ సునీల్​ జఖర్ కూడా​ ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఆయనకు బదులుగా అబోహర్​ నియోజకవర్గం నుంచి సునీల్ బంధువు సందీప్​ జఖర్​ పోటీ చేయనున్నారు.

ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కీలక నేతలు మన్​ప్రీత్​ సింగ్​ బాదల్​ (బఠిండా అర్బన్​ నియోజకవర్గం), విజయ్​ ఇందర్​ సింగ్లా (సంగ్రూర్​), రజియా సుల్తానా (మాలేర్​కొట్లా), గుర్కిరాత్​ సింగ్​ కొట్లీ (ఖన్నా), రానా గుర్జిత్​ సింగ్​ (కపుర్​తలా), త్రిప్ట్​ రాజీందర్​ బాజ్వా (ఫతేగఢ్​ చురియన్​), రణ్​దీప్​ సింగ్​ నభా (అమ్లోహ్​), అమరీందర్​ సింగ్​ రాజా (గిద్దర్​బాహ), పార్గత్​ సింగ్​ (జలంధర్​ కంట్​) నుంచి పోటీ చేయనున్నారు.

ఈ జాబితాను కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఖరారు చేసినట్లు కాంగ్రెస్​ వెల్లడించింది.

పంజాబ్ శాసనసభకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి.

ఇదీ చూడండి : సొంత ఇలాఖా నుంచే యోగి పోటీ- అఖిలేశ్​ సెటైర్​

Last Updated :Jan 15, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.