దేశ ప్రజలకు రాష్ట్రపతి వినాయక చవితి శుభాకాంక్షలు

author img

By

Published : Sep 9, 2021, 7:48 PM IST

Updated : Sep 9, 2021, 8:37 PM IST

President Kovind

భారతీయులందరికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​పై విజయం సాధించాలని.. ప్రజలు గణేషుడిని ప్రార్థించాలని సూచించారు.

దేశ ప్రజలకు, విదేశాల్లో ఉన్న భారతీయులందరికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్..​ గణేష్​ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​ మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. పండుగను జరుపుకోవాలని సూచించారు.

కొవిడ్​ 19పై పోరాటంలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని.. అందరికి సుఖ సంతోషాలు, శాంతి చేకూరాలని గణేషుడిని ప్రార్థించాలని రాష్ట్రపతి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వినియక చవితి విశిష్ఠతను గురించి వివరించారు కోవింద్​.

దేశప్రజలు వినాయక చవితి పండుగను శుక్రవారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మండపాలు సిద్ధమవుతున్నాయి. పండుగ కోసం షాపింగ్​ జోరుగా సాగుతోంది.

ఇదీ చదవండి: 'నీట్​' కేంద్రాల మార్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Last Updated :Sep 9, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.