51నెలల్లో ఐదుగురికి జన్మ.. శిశువులందరినీ విక్రయించిన దంపతులు!

author img

By

Published : Nov 19, 2022, 10:47 AM IST

Updated : Nov 19, 2022, 11:34 AM IST

Child Trafficking Case in nagpur

ముక్కుపచ్చలారని పసికందులను తమ తల్లిదండ్రుల నుంచి అపహరించి ఇష్టారాజ్యాంగా అమ్మతున్న ఓ ముఠా ఎట్టకేలకు దొరికింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్నబిడ్డలను సైతం వీరు విక్రయించారని తెలిసింది.

ఎనిమిది నెలల చిన్నారిని అపహరించిన కేసులో ఓ దంపతులను అరెస్టు చేశారు మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో పోలీసులు. ఆ నిందితులను విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేసు మరో మలుపు తిరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్​కు చెందిన యోగేంద్ర ప్రజాపతి అనే వ్యక్తితో రీటా అనే మహిళకు 2017లో వివాహం జరిగింది. 2018లో వారికి ఓ పాప పుట్టగా ఆమెను రూ.25 వేలకు అమ్మేశారు. అంతే కాకుండా మరో ఇద్దరు పిలల్ని సైతం ఇలాగే విక్రయించారు. దీంతో వారి దందా ప్రారంభమైంది. పిల్లల్ని ఎత్తుకెళ్లి వారిని ఇతర రాష్ట్రాలకు అమ్మడం స్టార్ట్ చేశారు.

అలా నవంబర్​ 10న నాగ్​పుర్​లోని బాలాఘాట్​లో ఓ ఎనిమిది నెలల పసికందును ఈ జంట ఎత్తుకెళ్లింది. తమ బిడ్డ కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఐదు గంటల్లో పట్టుకున్నారు. అయితే వారిద్దరూ పోలీసుల చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులకు.. బాలాఘాట్​లో నిందితులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని నాగ్​పుర్​కు తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రీటా అనే ఈ మహిళ 51 నెలల్లో సుమారు 5 మంది పిల్లలకు జన్మనివ్వగా.. వారిలో ముగ్గురిని మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఈ జంట విక్రయించింది. అలా సుమారు ఐదేళ్లలోనే వీరు ఏడు నుంచి తొమ్మిది మంది పిల్లలను ఇతర రాష్ట్రాలకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.

Last Updated :Nov 19, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.