మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం

author img

By

Published : Apr 18, 2022, 4:38 PM IST

Updated : Apr 18, 2022, 5:30 PM IST

pm modi

pm Modi address nation: గురువారం ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సిక్కు గురువు తేగ్ బహదూర్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. తేగ్​ బహదూర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు.

pm Modi address nation:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్​ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ 400 జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది.

సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. నరేంద్ర మోదీ గురువారం అదే తరహాలో ప్రసంగించనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు 'షాబాద్ కీర్తన' చేస్తారని తెలిపింది కేంద్ర సాంస్కృతిక శాఖ. దిల్లీ గురుద్వారా మేనేజమెంట్ సహకారంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సిక్కుల మతగురువు తేగ్​ బహదూర్ 400 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: 'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'

Last Updated :Apr 18, 2022, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.