Encounter at Pulwama: జమ్ముకశ్మీర్లో ఎస్సైని చంపిన ముష్కరుణ్ని పోలీసులు మట్టుపెట్టారు. పుల్వామాలోని తుజ్జాన్, బారాముల్లాలోని తులిబల్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. తుజ్జాన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ముష్కరుణ్ని హతం చేసినట్లు కశ్మీర్ జోనల్ పోలీసులు తెలిపారు. తులిబల్ గ్రామంలో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం అందడం వల్ల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడడం వల్ల.. భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా..అందులో ఒకరిని ఎస్సై ఫరూక్ అహ్మద్ మీర్ను చంపిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని.. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్ అహ్మద్ మీర్గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత.. పాంపొర్లోని సంబూరా ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్పొరా సీటీసీ ఐఆర్పీ 23వ బెటాలియన్లో మీర్ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు.
కశ్మీర్లో వరుసగా ఉగ్రఘాతుకాలు జరుగుతున్నాయి. హిందువులే లక్ష్యంగా ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఈ ఘటనల్లో ఓ నటి, బ్యాంకు మేనేజర్, జవాన్ సహా పలువురు పౌరులు మృతిచెందారు. అనంతరం.. భద్రతా బలగాలు ఆ హత్యల్లో భాగమైన వారిని మట్టుబెట్టాయి.
ఇదీ చదవండి: 17 వేల అడుగుల ఎత్తులో హిమవీరుల యోగాసనాలు.. గడ్డకట్టే చలిలోనూ సాహసాలు