ఎస్సై హత్యకు బదులు తీర్చుకున్న సైన్యం.. ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Jun 21, 2022, 12:04 PM IST

Jammu and Kashmir encounter news

ఎస్సై హత్యకు బదులు తీర్చుకున్న సైన్యం.. ముగ్గురు ముష్కరులు హతం

Encounter at Pulwama: జమ్ముకశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో తాజాగా ఎస్సైని హత్య చేసిన.. ముష్కరుణ్ని పోలీసులు మట్టుపెట్టారు.

Encounter at Pulwama: జమ్ముకశ్మీర్​లో ఎస్సైని చంపిన ముష్కరుణ్ని పోలీసులు మట్టుపెట్టారు. పుల్వామాలోని తుజ్జాన్, బారాముల్లాలోని తులిబల్​ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. తుజ్జాన్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఒక ముష్కరుణ్ని హతం చేసినట్లు కశ్మీర్​ జోనల్​ పోలీసులు తెలిపారు. తులిబల్​ గ్రామంలో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం అందడం వల్ల పోలీసులు ​కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడడం వల్ల.. భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా..అందులో ఒకరిని ఎస్సై ఫరూక్​ అహ్మద్​ మీర్​ను చంపిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతూనే ఉందని.. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్​ అహ్మద్​ మీర్​గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత.. పాంపొర్​లోని సంబూరా ప్రాంతంలో సబ్​ ఇన్​స్పెక్టర్​పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్​పొరా సీటీసీ ఐఆర్​పీ 23వ బెటాలియన్​లో మీర్​ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు.

కశ్మీర్​లో వరుసగా ఉగ్రఘాతుకాలు జరుగుతున్నాయి. హిందువులే లక్ష్యంగా ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఈ ఘటనల్లో ఓ నటి, బ్యాంకు మేనేజర్​, జవాన్​ సహా పలువురు పౌరులు మృతిచెందారు. అనంతరం.. భద్రతా బలగాలు ఆ హత్యల్లో భాగమైన వారిని మట్టుబెట్టాయి.

ఇదీ చదవండి: 17 వేల అడుగుల ఎత్తులో హిమవీరుల యోగాసనాలు.. గడ్డకట్టే చలిలోనూ సాహసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.