లారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం, కారు బోల్తా పడి మరో ఐదుగురు

author img

By

Published : Aug 28, 2022, 8:36 AM IST

Updated : Aug 28, 2022, 9:29 AM IST

odisha accident

ఆటోను వేగంగా వస్తున్న బొగ్గు లారీ బలంగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం ఒడిశాలో జరిగింది. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో వేగంగా వెళ్తున్న ఓ కారు వంతెనను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో మరో ఐదుగురు చనిపోయారు.

Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు మరణించారు. వేగంగా వస్తున్న బొగ్గు లారీ.. ఆటోను బలంగా ఢీకొట్టింది. డెంకానల్​ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మైనర్​ సహా ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బంగూర గ్రామానికి చెందిన వారని, ఆటోలో పని కోసం ముక్తపేసి ప్రాంతానికి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

వంతెనను ఢీకొట్టి.. బోల్తా పడ్డ కారు..
ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భగవాన్​పుర్​లో శనివారం వేగంగా వెళ్తున్న ఓ కారు వంతెనను ఢీకొట్టి, బోల్తా పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బైక్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
భగవాన్​పుర్ కాలువ సమీపంలో అజంగఢ్​ వైపు వెళ్తున్న కారు.. బ్రిడ్జిని బలంగా ఢీకొట్టి ఒక్కసారిగా బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించగా.. బైక్​పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయాడని తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.

ఇవీ చదవండి: సంక్షోభాల సంద్రంలో చుక్కాని కరవైన కాంగ్రెస్

అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే, ఏం జరుగుతుందో

Last Updated :Aug 28, 2022, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.