కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీకి మరోసారి కరోనా

author img

By

Published : Jan 11, 2022, 11:55 PM IST

Nitin Gadkari

Nitin Gadkari Covid 19: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించారు గడ్కరీ.

Nitin Gadkari Covid 19: కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించిన ఆయన.. తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

"ఈరోజు (మంగళవారం) చేసిన పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. స్వల్ప లక్షణాలున్నాయి. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నాను. నన్ను ఇటీవలే కలిసినవారు.. ఐసోలేషన్​కు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా." అని గడ్కరీ ట్వీట్ చేశారు. గతేడాది సెప్టెంబర్​లోనూ ఆయన కొవిడ్ బారినపడ్డారు.

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు కొవిడ్ బారినపడుతున్నారు. రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఇటీవలే కొవిడ్ నిర్ధరణ అయిన ప్రముఖుల్లో ఉన్నారు.

ఇదీ చూడండి: రక్షణ మంత్రి రాజ్​నాథ్​కు కరోనా.. ఇద్దరు సీఎంలకు కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.