కశ్మీర్​లో పౌరుల హత్యలపై 11చోట్లు ఎన్​ఐఏ సోదాలు

author img

By

Published : Oct 20, 2021, 12:31 PM IST

NIA

జమ్ముకశ్మీర్​లో స్థానికేతరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు చేపట్టింది. (jammu kashmir news). సుమారు 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

జమ్ముకశ్మీర్​లో (jammu kashmir news) స్థానిక, స్థానికేతరుల మీద జరిగిన హింసాత్మాక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. సుమారు 11 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా శ్రీనగర్​, బారాముల్లా, అవంతిపుర, సోపుర్​, కుల్గాంలలో సోదాలు చేపట్టింది.

బృందాలుగా విడిపోయిన అధికారులు బారాముల్లా జిల్లాలోని ఫతేగఢ్​, నార్వాలోని అడోరా గ్రామాల్లో సోదాలు చేపట్టారు. ఫతేగఢ్​లోని షేక్​ అష్రఫ్​ మంజూర్​, అడోరాలోని హురియత్​ జీ నాయకుడు అబ్దుల్​ రషీద్​ ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: కశ్మీర్​లో పౌరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.