లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి.. 47 మందికి గాయాలు

author img

By

Published : Jun 24, 2022, 8:51 AM IST

Road Accident:

Road Accident: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​టేక్​ చేస్తుండగా.. అదుపుతప్పి ఓ బస్సు లోయలో బోల్తా పడింది. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 47 మంది గాయపడ్డారు.

Road Accident: మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్​టేక్​ చేస్తుండగా.. అదుపుతప్పి లోయలో బోల్తా పడింది ఓ బస్సు. ఇందోర్​-ఖాంద్వా రోడ్డులో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 47 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​. వారితో పాటు క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్​గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి: 'మహా' డిప్యూటీ స్పీకర్​కు​ శిందే లేఖ.. శాసనపక్ష హోదాకు వినతి

నేడే ద్రౌపదీ ముర్ము నామినేషన్.. జులై 1 నుంచి రాష్ట్రాల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.