డిప్యూటీ కలెక్టర్​కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు

author img

By

Published : Jul 21, 2022, 6:53 PM IST

mandsaur Deputy collector assaulted

రోడ్డుపై బైక్​ను జాగ్రత్తగా నడపమని చెప్పిన డిప్యూటీ కలెక్టర్​ను భార్యాభర్తలు రోడ్డుపైనే చితకబాదారు. మధ్యప్రదేశ్​లోని మంద్​సౌర్​లో జరిగిందీ ఘటన.

మధ్యప్రదేశ్​ మంద్​సౌర్​ జిల్లా డిప్యూటీ కలెక్టర్​పై ఓ జంట నడిరోడ్డుపైనే దాడి చేసింది. బూతులు తిడుతూ, చెప్పులతో కొడుతూ వీరంగం సృష్టించింది. డిప్యూటీ కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
అలా చెప్పడమే తప్పు!: అరవింద్ మహోర్.. మంద్​సౌర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్​గా పనిచేస్తున్నారు. పిప్లియా మండీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనేందుకు కారులో వెళ్తున్నారు. మరోవైపు.. రోడ్డు పక్కన చిన్న హోటల్​ నడుపుకునే మోహన్ లాల్, అతడి భార్య భావన.. బైక్​పై అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. అయితే.. మోహన్​ లాల్​ ద్విచక్ర వాహనంపై రకరకాల విన్యాసాలు చేశాడు. డిప్యూటీ కలెక్టర్​ కారుకు పదేపదే అడ్డం వచ్చాడు.

ఓ దశలో డిప్యూటీ కలెక్టర్​ వాహనం ఆపి.. మోహన్​ లాల్​తో మాట్లాడారు. బైక్​పై స్టంట్స్​ చేయకుండా, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వెంటనే మోహన్​ లాల్, అతడి భార్య కోపోద్రిక్తులయ్యారు. 'మాకే చెబుతావా' అంటూ దాడికి తెగబడ్డారు. భావన.. డిప్యూటీ కలెక్టర్​ కాలర్​ పట్టుకుని చెప్పుతో కొట్టింది.
అరవింద్​ ఫిర్యాదు మేరకు.. ఎస్​సీ/ఎస్​టీ వేధింపుల నిరోధక చట్టం సహా వేర్వేరు సెక్షన్ల కింద మంద్​సౌర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.