భాజపాకు మరో​ మంత్రి గుడ్​బై.. ఎస్​పీలో చేరిక?

author img

By

Published : Jan 13, 2022, 4:06 PM IST

Updated : Jan 13, 2022, 5:27 PM IST

Dharam Singh Saini Quit BJP

Dharam Singh Saini: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది యూపీ రాజకీయాల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. భాజపాను వీడిన నేతల జాబితాలో మరో ఇద్దరు చేరారు. కేబినెట్​ మంత్రి ధరమ్​ సింగ్​ సైనీ.. పదవికి రాజీనామా చేసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్యే ముకేశ్​ వర్మ కూడా రాజీనామా ప్రకటించి భాజపా ప్రభుత్వానికి షాక్​ ఇచ్చారు.

Dharam Singh Saini Quit BJP: ఉత్తర్​ప్రదేశ్​లో గత రెండు రోజులుగా ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో అక్కడి భాజపా ప్రభుత్వం ఉక్కిరిబిక్కరి అవుతోంది. తాజాగా కేబినెట్​ మంత్రి ధరమ్​ సింగ్​ సైనీ సహా ఎమ్మెల్యే ముకేశ్​ వర్మ భాజపా నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. కేవలం మూడు రోజుల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.

"ఆయుశ్​ శాఖ మంత్రిగా నేను నిబద్ధతతో బాధ్యతలు చేపట్టాను. కానీ వెనుకబడిన వర్గాలు, దళితులు, నిరుద్యోగ యువత, చిన్న-మధ్యతరగతి పరిశ్రమ వ్యాపారుల పట్ల భాజపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్లే నేను పార్టీని వీడుతున్నాను."

-ధరమ్​ సింగ్​ సైనీ

శిఖోహాబాద్​ ఎమ్మెల్యే ముకేశ్​ వర్మ కూడా ఇదే కారణాన్ని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఓబీసీ నేత స్వామి ప్రసాద్​ మౌర్య నేతృత్వంలో న్యాయ పోరాటం కొనసాగిస్తాను అని పేర్కొన్నారు.

అఖిలేశ్​తో భేటీ

రాజీనామా అనంతరం ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ను ధరమ్​సింగ్​ సైనీ కలిశారు. సైనీ రాజీనామాను స్వాగతించిన అఖిలేశ్​.. ఆయను పార్టీలోకి ఆహ్వానించారు. సామాజిక న్యాయం కోసం పారాటం చేసే మరో నేత తమ పార్టీలో చేరుతున్నట్లు ట్వీట్​ చేశారు.

సైకిల్​ ఎక్కుతారా?

భాజపాకు రాజీనామా చేసిన నేపథ్యంలో వర్మ కూడా సమాజ్​వాదీ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా తనకు టికెట్​ ఇవ్వదని భావించి ఎస్​పీ నేతలను వర్మ కలవడం గమనార్హం.

ఇప్పటివరకు స్వామిప్రసాద్​ మౌర్య, దారా సింగ్​ చౌహాన్, రోషన్​ లాల్​, భగవతి సాగర్​, బ్రజేశ్​ ప్రజాపతి, అవతార్​ సింగ్​ భదానా, వినయ్​ శక్యా భాజపాను వీడారు. తాజాగా ధరమ్​ సింగ్​ సైనీ, ముకేశ్​ వర్మ రాజీనామాలతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది.

Dharam Singh Saini Quit BJP
ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ను కలిసిన ధరమ్​ సింగ్​ సైనీ

'భాజపాలో రాజీనామాలు లేని రోజు లేదు'

ఉత్తర్​ప్రదేశ్​లో రాజీనామాల పర్వంపై నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​ స్పందించారు. భాజపాలో నిత్యం ఎవరో ఓ నేత ఆ పార్టీని వీడుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఉత్తర్​ప్రదేశ్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. "13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ప్రకటించనున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు నేడు ఆ పార్టీని వీడతారు." అని జోస్యం చెప్పారు శరద్​ పవార్​.

ఇదీ చూడండి : యూపీలో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్​

Last Updated :Jan 13, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.