ప్రేమను నిరాకరించారని మనస్తాపం, వివాహిత ఆత్మహత్య

author img

By

Published : Aug 26, 2022, 1:25 PM IST

suicide

తన ప్రేమను నిరాకరించారనే బాధతో ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన మూడు నెలలకే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రేమను ప్రియుడి ఇంట్లో కాదన్నారని మృతిచెందిదని పోలీసులు నిర్ధరించారు.

ఝార్ఖండ్​లోని పాలమూ జిల్లాలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. తన ప్రేమను ప్రియుడి ఇంట్లో కాదన్నారని ఉరి వేసుకుంది. గార్హవా గ్రామంలోని రామకుందా పోలిస్​స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు రామకందా జిల్లాకు చెందిన కిరణ్​ దేవీగా గుర్తించారు.

అసలేం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకందా గ్రామానికి చెందిన కిరణ్​ దేవికి మూడు నెలల క్రితమే పెళ్లి అయింది. ఆమెకు మహేశ్​​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. ఆగస్టు 16 రాత్రి కిరణ్​ను కలిసేందుకు మహేశ్​ వచ్చాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. వారందరూ అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా మహేశ్ తప్పించుకున్నాడు. మరుసటి రోజు కిరణ్​ ఇంటి వద్ద మరచిపోయిన బైక్​ను తీసుకునేందుకు వచ్చిన అతడ్ని గ్రామస్థులు పట్టుకున్నారు. కిరణ్​ను, ఆమె ప్రియుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టారు. కిరణ్​ భర్త ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించి, ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. అప్పటి నుంచి ఆమె ప్రియుడు మహేశ్​ ఇంట్లో ఉంటోంది. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందినందున వీరి ప్రేమను మహేశ్​ కుటుంబసభ్యులు నిరాకరించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్​ ఆత్మహత్యకు పాల్పడింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.