'వారి సస్పెన్షన్​ రాజ్యాంగ విరుద్ధం.. నిరసనలు కొనసాగిస్తాం'

author img

By

Published : Dec 7, 2021, 4:33 PM IST

mallikarjun kharge

Suspension of Rajya Sabha Members: 12 మంది ఎంపీల సస్పెన్షన్​కు సంబంధించి కేంద్రంపై తీవ్రవిమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత మల్లికార్జున ఖర్గే. ప్రభుత్వం చేపట్టిన చర్య ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమని.. కేంద్రం తమ గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Suspension of Rajya Sabha Members: రాజ్యసభలో ఏర్పడిన ప్రతిష్టంభణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. 12 మంది ఎంపీలను సస్పెండ్​ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్ధమని.. ఇది అప్రజాస్వామ్యమని ఆరోపించారు. సస్పెండైన ఎంపీలకు మద్దతుగా తాము నిరసన కొనసాగిస్తామని పేర్కొన్నారు.

"ప్రభుత్వ వైఖరిపై ఛైర్మన్​కు ఫిర్యాదు చేశాం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం 12 మంది ఎంపీలపై సస్పెన్షన్​ వేటు వేసింది. ఎంపీలపై చర్యలు చేపట్టే ముందు ప్రతీ ఎంపీ పేరు ప్రస్తావించి వారిపై వేటు వేయడానికి గల కారణాలను తెలియజేయాలి. గత సమావేశాలకు సంబంధించి ఎంపీలను ఇప్పుడు సస్పెండ్​ చేసే హక్కు కేంద్రానికి లేదు. ఈ చర్య రాజ్యాంగంలో కూడా లేదు."

-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ సీనియర్ నేత

రాజ్యసభలో సమావేశాలు జరగకపోవడమే భాజపా లక్ష్యమని ఆరోపించారు ఖర్గే. ఎంపీలపై సస్పెన్షన్​ ఎత్తివేసే వరకు పోరాడతామని పేర్కొన్నారు. 'నిరంకుశత్వంతో మోదీజీ పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారు. అలా జరగనివ్వము' అని ఖర్గే అన్నారు.

క్షమాపణలు చెప్తేనే..

12 మంది ఎంపీల సస్పెన్షన్​పై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్​ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి స్పందించారు. సంబంధిత ఎంపీలు క్షమాపణలు చెప్తేనే.. వారిపై సస్పెన్షన్ వేటు తొలగిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్​ సందర్భంగా ఎంపీల సస్పెన్షన్​కు గల కారణాలను వెల్లడించామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రెట్టింపు వేగంతో అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.