ప్రయాణికుడి కడుపులో కేజీ బంగారం.. ఎక్స్​రేలో బయటపడ్డ నాలుగు క్యాప్సూల్స్​

author img

By

Published : Sep 20, 2022, 10:13 AM IST

Karipur Gold smuggling case

Kozhikode Gold smuggling: కడుపులో బంగారాన్ని క్యాప్స్యూల్స్​గా మార్చి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కోజీకోడ్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు సింగపూర్​ నుంచి వస్తున్న ఓ వ్యక్తి నుంచి 1,140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కోల్​కతా కస్టమ్స్ అధికారులు. వీటి విలువ దాదాపు రూ.56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Kozhikode Gold smuggling: కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు కేజీ బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్​లో నింపి.. కడుపులో దాచుకొని తరలిస్తున్నట్లు గుర్తించారు.
మలప్పురం జిల్లా వరియంకోడ్​కు చెందిన నౌఫల్​(36) అనే వ్యక్తి దుబాయ్ నుంచి కొజీకోడ్​కు వచ్చాడు. 1.063 కేజీల బంగారాన్ని 4 క్యాప్సూల్స్‌గా మార్చి కడుపులో పెట్టుకున్నాడు. పోలీసులు అతడిని తనిఖీ చేసినా బంగారాన్ని కనిపెట్టలేకపోయారు. అయినా అనుమానం వచ్చిన అధికారులు.. నిందితుడు నౌఫల్‌ను కొండొట్టిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతడికి ఎక్స్‌రే తీయగాా కడుపులో ఉన్న నాలుగు బంగారు క్యాప్సూల్స్ బయటపడ్డాయి.

రూ.56 లక్షల విలువ..: బంగాల్​ కోల్​కతా విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా సింగపూర్​ నుంచి వచ్చిన ఓ భారతీయ వ్యక్తి నుంచి సుమారు 1,140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 బంగారు నాణేలు, 3 బంగారు కడ్డీలు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ.56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.

ఇవీ చదవండి: తాజ్​మహల్​ వద్ద కోతులు రచ్చ రచ్చ.. పర్యటకులు హడల్!

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.