వర్ష బీభత్సానికి 24 మంది బలి- 5 లక్షల ఎకరాల పంట నష్టం

author img

By

Published : Nov 22, 2021, 12:27 PM IST

Updated : Nov 22, 2021, 2:14 PM IST

rain in bangalore

కర్ణాటకలో కుండపోత వర్షాలతో (Heavy rains in karnataka) ఇప్పటివరకు 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 5 లక్షల ఎకరాలకుపైగా పంటదెబ్బతిన్నట్లు పేర్కొంది. మరోవైపు.. బెంగళూరు జలదిగ్భందం అయింది. ఎటు చూసినా వరదనీటితో నిండిపోయింది.

కర్ణాటకలో భారీ వర్షాలు

భారీవర్షాల కారణంగా కర్ణాటకలో (Rain in Bangalore) 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దాదాపు 5 లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 8,495 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు పేర్కొంది. వర్షం కారణంగా.. బెంగళూరు అర్బన్​, బెంగళూరు రూరల్, తుమకూరు, కోలార్, చిక్కబళ్లాపుర్, రామ్​నగర్​, హసన్​ జిల్లాలు తీవ్ర ప్రభావం చెందినట్లు తెలిపింది.

Karnataka Rain
వరద ప్రవాహం
Karnataka Rain
నీట మునిగిన వాహనాలు
Karnataka Rain
.

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన క్రమంలో పరిహారం కింద రూ. 130కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Karnataka Rain
ఎన్​డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
Karnataka Rain
.

బెంగళూరు జలదిగ్భందం..

బెంగళూరు జలదిగ్భందం అయింది. నగరంలో ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది. కాలనీలు, అపార్ట్​మెంట్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్ బృందం.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిరాశ్రయులైన ప్రజలకు ప్రజలకు ఆహార పంపిణీ చేపట్టారు అధికారులు.

Karnataka Rain
నేలకొరిగిన పంట
Karnataka Rain
.

ఇదీ చూడండి: వరద ఉద్ధృతిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!

Last Updated :Nov 22, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.