తండ్రి పాదాలు కడిగిన కుమారుడు.. ఇంట్లోంచి గెంటేసిన కొన్నాళ్లకే..

author img

By

Published : May 14, 2022, 5:33 PM IST

Updated : May 14, 2022, 6:04 PM IST

son washed father feet

Son Washed Father Feet: రాత్రింబవళ్లు కష్టపడి పెంచిన కుమారుడే.. వృద్ధ తండ్రిని ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ 80 ఏళ్ల తండ్రి.. సిహోరా సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్​ను ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తండ్రీకొడుకులను నచ్చజెప్పిన ఎస్​డీఎం ఆశిష్ పాండే.. వారిద్దరినీ ఒక్కటి చేశారు.

ఎస్​డీఎం కార్యాలయంలో తండ్రి పాదాలు కడిగిన కుమారుడు

Son Washed Father Feet: మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఆసక్తికర ఘటన జరిగింది. సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే తండ్రి పాదాలను కడిగాడు ఓ కుమారుడు. అయితే అంతకు కొన్ని రోజుల ముందే ఆ తండ్రిని కుమారుడు ఇంట్లోంచి గెంటివేశాడు. కొడుకులో వచ్చిన ఈ మార్పునకు కారణం సిహోరా ఎస్​డీఎం ఆశిష్ పాండే.

son washed father feet
తండ్రి పాదాలు కడుగుతున్న కుమారుడు

ఇదీ జరిగింది: జబల్​పుర్​కు చెందిన ఆనంద్​ గిరి అనే 80 ఏళ్ల వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు కొన్నాళ్ల క్రితం ఇంట్లోంచి గెంటివేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తండ్రి.. సిహోరా ఎస్​డీఎంను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. రంగంలోకి దిగిన ఆశిష్ పాండే.. ఆ కుమారుడికి హిత బోధ చేశారు. తండ్రి గొప్పతనాన్ని వివరించారు. దాంతో పాటే తండ్రి బాగోగులు చూసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో వచ్చిన మార్పుతో అక్కడే తండ్రి పాదాలను కడిగాడు ఆ కుమారుడు. ఈ సంఘటన పట్ల కార్యాలయంలో ఉన్నవారు హర్షం వ్యక్తంచేశారు.

son washed father feet
కాళ్లు తుడుస్తున్న కుమారుడు

ఇదీ చూడండి: గ్రామస్థుల నీటి కష్టాలు.. మట్టి తవ్వితేనే గొంతు తడిసేది..!

Last Updated :May 14, 2022, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.