ప్లాట్​ఫామ్ టికెట్​ ధరను తగ్గించిన రైల్వే

author img

By

Published : Nov 26, 2021, 6:46 AM IST

platform ticket price

ప్లాట్​ఫామ్​ టికెట్లపై పెంచిన ఛార్జీలను (Platform Ticket Price) తగ్గిస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. దీంతో రూ.50గా ఉన్న ప్లాట్​ఫామ్​ టికెట్​ ధర మళ్లీ రూ.10కు చేరనుంది. దేశవ్యాప్తంగా ఈ ధరల మార్పు అందుబాటులోకి రానుంది.

కొవిడ్​ ఉద్ధృతి సమయంలో పెంచిన రైల్వే ప్లాట్​ఫామ్​ టికెట్​ (Platform Ticket Price) ధరను తగ్గిస్తున్నట్లు రైల్వే గురువారం ప్రకటించింది. కరోనా వేళ రైల్వే స్టేషన్లలో రద్దీని (Platform Ticket Price) తగ్గించేందుకు టికెట్​ ధరను రూ.50గా చేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్లాట్​ఫామ్​ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

తాజాగా రైల్వే చేసిన ప్రకటనతో ప్రయాణికులకు ఊరట కలిగినట్లు అయింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోను (Platform Ticket Price) ఇక నుంచి మళ్లీ రూ.10కే ప్లాట్​ఫామ్​ టికెట్​ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి : కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల ఎగుమతికి కేంద్రం పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.