దిల్లీలో ఒక్కరోజే వెయ్యి మందికి కరోనా​.. భారత్​లో ఎన్ని కేసులంటే?

author img

By

Published : May 13, 2022, 9:41 AM IST

India Corona Cases

India Corona Cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగానే నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 2,841 మందికి వైరస్​ సోకింది. మరో 9 మంది మరణించారు. కొత్త కేసుల్లో దిల్లీలోనే వెయ్యికిపైగా ఉండటం గమనార్హం.

India Corona Cases: భారత్​లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,841 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో దిల్లీ నుంచే 1032 మంది బాధితులు ఉన్నారు. మరో 9 మంది చనిపోయారు. ఒక్కరోజే 3,295 మంది కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. యాక్టివ్​ కేసులు 19 వేల దిగువకు చేరాయి. యాక్టివ్​ కేసుల శాతం 0.04గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,16,254
  • మొత్తం మరణాలు: 5,24,190
  • యాక్టివ్​ కేసులు: 18604
  • కోలుకున్నవారి సంఖ్య: 42573460

Vaccination India: దేశవ్యాప్తంగా గురువారం 14,03,220 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,90,99,44,803కి చేరింది. ఒక్కరోజే 4,86,628 కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దాదాపు 6 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 51,96,57,147కు చేరింది. మరణాల సంఖ్య 62,84,432కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,44,09,097గా ఉంది.

  • అమెరికాలో 85 వేలకుపైగా కొత్త కేసులు, 222 మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్​తో మొత్తం మరణించిన వారి సంఖ్య 10 లక్షల 26 వేలు దాటింది.
  • జర్మనీలో ఒక్కరోజే 82 వేల కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి.
  • ఇటలీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్​ల్లో సగటున 35 వేలకుపైగా కరోనా బారినపడుతున్నారు. మరణాల సంఖ్య వందకుపైనే నమోదవుతోంది.
  • ఆస్ట్రేలియాలో గురువారం 57 వేలు, జపాన్​లో 45 వేలమందికిపైగా వైరస్​ సోకింది.

ఇవీ చూడండి: 'మూడోసారీ నేనే ప్రధాని'... క్లారిటీ ఇచ్చిన మోదీ!

సరూర్​నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.