యువతిపై ఐఎఫ్​ఎస్​ అధికారి అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి!

author img

By

Published : Jul 8, 2022, 7:38 AM IST

మహిళపై అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి ఐఎఫ్​ఎస్​ అధికారి అత్యాచారానికి పాల్పడిన ఘటన దిల్లీలో జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఐఎఫ్ఎస్​ అధికారి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని కోల్​కతాలో అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే: అంశుమాన్ రాజహంస​ 2020 బ్యాచ్​ ఐఎఫ్​ఎస్ అధికారి. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఇంజనీర్​తో 2017లో పరిచయం ఏర్పడింది. ఈమె సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కోసం దిల్లీలోని రాజేంద్ర నగర్​కు వచ్చింది. అప్పుడే రాజహంసతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వివాహానికి ముందే ఇద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు. 2018 సివిల్స్​లో రాజహంసకు ఐఆర్​టిఎస్​ ర్యాంకు వచ్చింది. అనంతరం సివిల్స్ ఉన్నత క్యాడర్​ ఉన్న ఉద్యోగాన్ని సాధించి పెళ్లి చేసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చాడు రాజహంస. 2020లో ఐఎఫ్ఎస్​కు ఎంపికైన తర్వాత తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అయితే ఆ సమయంలో ఫొటోలు తీయడానికి అతను అనుమతించలేదని బాధితురాలు తెలిపింది.

2020 సివిల్స్​లో ఐఎఫ్​ఎస్​ ఉద్యోగాన్ని సాధించిన రాజహంసకు.. శిక్షణ పూర్తయాక ఝూర్ఖండ్​లో ఉద్యోగం వచ్చింది. దిల్లీ నుంచి ఝూర్ఖండ్​కు మకాం మార్చాడు. బాధితురాలు అతడిని కలిసి పెళ్లి చేసుకుందామని కోరగా తిరస్కరించాడు. దీంతో నిందితుడిపై రాజేంద్ర నగర్​ పోలీసు స్టేషన్​లో కేసు పెట్టింది బాధితురాలు. 15 రోజుల నుంచి పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడు రాంచీలో ఉన్నాడని సమాచారం అందడం వల్ల అక్కడికి వెళ్లారు. జంషెడ్​పుర్​ ఇలా పలు ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆఖరికి కోల్​కతాలో పట్టుకున్నారు. నిందితుడ్ని దిల్లీలోని కోర్టు ముందు ప్రవేశపెట్టి.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి: భార్యకు నిప్పంటించిన భర్త.. ఏడేళ్ల బాలికపై మైనర్లు అత్యాచారం

సినిమా స్టైల్​లో స్టూడెంట్​కు టీచర్​ ప్రపోజ్​.. పోయిన ఉద్యోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.