గుజరాత్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.0 తీవ్రత

author img

By

Published : Aug 4, 2021, 10:19 PM IST

earthqauke in gujarat

గుజరాత్​లో బుధవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది.

గుజరాత్​ కచ్​ జిల్లాలో బుధవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం రాపార్​కు సమీపంలో ఉన్నట్లు గాంధీనగర్​కు చెందిన భూకంప అధ్యయన సంస్థ(ఐఎస్​ఆర్​) వెల్లడించింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

బుధవారం సాయంత్రం 7.14 గంటలకు భూమిలో ప్రకంపనలు సంభవించాయని ఐఎస్​ఆర్​ అధికారి ఒకరు తెలిపారు. రాపార్​కు 25కిలో మీటర్ల దూరంలో 6 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా.. దుదాయ్​లోనూ 2.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవిచాయని చెప్పారు.

ఇదీ చూడండి: ఆ నది ఉగ్రరూపం- 50 ఏళ్లలో తొలిసారి ఇలా...

ఇదీ చూడండి: కేరళలో 22వేల కరోనా కేసులు- మిగతా రాష్ట్రాల్లో ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.