మనవడిపై బామ్మ పోలీసు కేసు.. పెంపుడు శునకం కరిచిందని..

author img

By

Published : May 9, 2022, 11:01 PM IST

Grand Mother File Case On Grand Son

Grand Mother File Case On Grand Son: తన మనవడి పెంపుడు శునకం కరిచిందని అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ వృద్ధురాలు. ఈ ఆసక్తికర ఘటన దిల్లీలో జరిగింది. మనవడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Grand Mother File Case On Grand Son: దేశ రాజధాని దిల్లీలో ఆసక్తికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పెంపుడు కుక్క కరిచిందనే కారణంతో సొంత మనవడిపైనే ఫిర్యాదు చేసింది ఓ వృద్ధురాలు. దీంతో మనవడిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని సార్లు చెప్పినా మనవడు మాట వినకపోవడం వల్లే ఫిర్యాదు చేసినట్లు వృద్ధురాలు పేర్కొన్నారు.

జగత్​పురి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శివపురి సిల్వర్​ పార్క్​లో 75 ఏళ్ల రమాదేవి నివసిస్తున్నారు. ఆమెతో పాటు కుమార్తె సునీత, అల్లుడు, ఇద్దరు మనువళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన మనవళ్లలో ఒకరైన జతిన్​.. తొమ్మిది నెలల క్రితం కుక్కను ఇంటికి తెచ్చుకున్నాడు. కుక్కను కట్టివేయకుండా ఇంట్లోనే ఉంచడం వల్ల మొరుగుతూ ఇతరులను కరిచేది. కుక్కను కట్టివేయమని ఎంత చెప్పినా అతడు ఆమె మాట వినలేదు. మే 5న ఉదయం 11:30 గంటలకు ఇంటిని శుభ్రం చేస్తుండగా రమాదేవిని శునకం కరిచింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బామ్మ ఫిర్యాదు మేరకు మనవడిపై చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలిపారు.

ఇదీ చదవండి: పెళ్లిలో పవర్​ కట్​.. మారిపోయిన వధూవరులు.. ఒకరితో మరొకరు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.