'అతడ్ని రేప్ చేసిన నలుగురు యువతులు​' కథలో కొత్త ట్విస్ట్

author img

By

Published : Nov 24, 2022, 8:47 PM IST

four girls raping a person in Jalandhar

పంజాబ్​లో ఓ వింత ఘటన వెలుగుచూసింది. నలుగురు అమ్మాయిలు కలిసి ఓ యువకుడిపై అత్యాచారం చేశారు. ఈ ఘటనను వివరిస్తూ బాధితుడు ఓ వీడియో విడుదల చేశాడు.

పంజాబ్​లో ఓ వీడియో స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడిని నలుగురు యువతులు కిడ్నాప్​ చేసి.. అత్యాచారాని పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితుడు ఓ వీడియో ద్వారా తెలిపాడు. దీంతో ఈ వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

జలంధర్​లో కపుర్తలా రోడ్డులోని ఓ లెదర్​ కాంప్లెక్సు​లో పని ముగించుకుని.. ఓ యువకుడు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా కారులో వచ్చిన అమ్మాయిలు, మత్తుమందు చల్లి అతడిని కిడ్నాప్​ చేశారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువతులు.. ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. ఆపై అతడిని తాళ్లతో కట్టి.. అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అదే కారులో వచ్చి, ఓ ప్రదేశంలో రోడ్డుపై విడిచి వెళ్లారు. ఈ మేరకు బాధితుడు ఓ వీడియో విడుదల చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని.. అందుకే ఫిర్యాదు చేయలేదని తెలిపాడు.

ఈ వార్తలపై జలంధర్​ డీసీపీ జగన్మోహన్​ సింగ్​ స్పందించారు. అలాంటి కేసు ఏదీ తమ వద్దకు రాలేదని అన్నారు. దానిపై ఏ పోలీస్​స్టేషన్​లో కూడా ఫిర్యాదు అందలేదని తెలిపారు. వార్తా కథనాల ప్రకారం ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.