మార్నింగ్​ వాక్​ చేస్తున్న వారే టార్గెట్.. బైక్​పై వచ్చి కాల్పులు.. లక్కీగా ముగ్గురు...

author img

By

Published : Oct 2, 2022, 2:33 PM IST

firing on walkers in up today

మార్నింగ్ వాక్​కు వెళ్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్​లోని సింభావలి పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. మార్నింగ్ వాక్​కు వెళ్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటన సింభావలి పోలీస్ స్టేషన్​ పరిధిలో దేవలి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

firing on walkers in up today
ఘటనా స్థలంలో పోలీసులు

దేవలి గ్రామానికి చెందిన సుజిత్​ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం 6:15 గంటలకు మార్నింగ్ వాక్​కు బయలుదేరాడు. కొంత దూరం వెళ్లగానే మోటార్​ సైకిల్​పై వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుజిత్ సహా ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

firing on walkers in up today
ఘటనా స్థలంలో పోలీసులు

ఇవీ చదవండి: ఎలుక అనుకొని అండర్​వేర్ మింగిన పాము.. మింగలేక, కక్కలేక అవస్తలు

సాయం చేసేవారిపై మృత్యువు పంజా.. ఆటో డ్రైవర్​ను రక్షిస్తూ ఇద్దరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.