ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు- మరోసారి ఈసీ కీలక నిర్ణయం

author img

By

Published : Jan 15, 2022, 6:02 PM IST

Updated : Jan 15, 2022, 7:06 PM IST

election comission

Election Commission: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, రోడ్​షోలపై విధించిన ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించింది. మరోవైపు బంగాల్​లో ఈనెల 22న జరగాల్సిన నాలుగు మున్సిపల్​ కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేసింది.

Election Commission: ఎన్నికల ర్యాలీలు, రోడ్​షోలపై విధించిన నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలు ఇండోర్​ మీటింగ్స్​ నిర్వహించుకోవచ్చని తెలిపింది.

హాజరు సంఖ్య 300 మంది కన్నా తక్కువ లేదా హాలులో 50 శాతం ఉండాలని స్పష్టం చేసింది.

అన్ని పార్టీలు కొవిడ్​ మార్గదర్శకాలను తప్పక పాటించాలని తెలిపింది.

మున్సిపల్​ ఎన్నికలు వాయిదా..

బంగాల్​లో కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో నాలుగు మున్సిపల్​ కార్పొరేషన్​లలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. సిలిగుడీ, ఛాన్​దెర్నాగోర్​, బిధాన్​నగర్​, అసన్​సోల్​ మున్సిపల్​ కార్పొరేషన్​లలో ఈనెల 22న జరగాల్సిన ఈ ఎన్నికలను ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి : 'అమెరికా ఆస్పత్రి నుంచే కేరళ పాలన.. బైడెన్​లా చేయరట!'

Last Updated :Jan 15, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.