కరోనాతో కొడుకు మృతి.. కోడలికి దగ్గరుండి రెండో పెళ్లి.. గిఫ్ట్​గా బంగ్లా

author img

By

Published : May 13, 2022, 4:10 PM IST

widowed daughter in law remarried

Daughter in law remarriage: కరోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు.. ఆమె అత్తామామలే తల్లిదండ్రులుగా మారి మరో వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్​లోని ధార్ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పెళ్లి చేయించడమే కాకుండా మరణించిన తమ కుమారుడి ఇంటినీ కోడలికి రాసి ఇచ్చేశారు.

Widowed daughter in law remarried: కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో చీకటిమయం చేసింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు.. భర్తలను పోగొట్టుకున్న భార్యలు ఎందరో ఉన్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన కుటుంబం ఇలాంటి బాధనే అనుభవించింది. ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్​ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల వయసు ఉన్న కూతురు ఉన్నారు. ప్రియాంక్ మృతితో వీరంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

widowed daughter in law remarried
ప్రియాంక్ తివారి- ప్రియాంక
widowed daughter in law remarried
ప్రియాంక్ తివారి- ప్రియాంక

అయితే, కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోవద్దని ఆమె అత్త, మామ ఆలోచించారు. ఆమెను తమ సొంత కూతురిలా భావించి.. మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఆమెకు కొత్త జీవితం ప్రసాదించారు. అక్షయతృతియ రోజున నాగ్​పుర్​లో ప్రియాంక వివాహం జరిపించారు. కోడలికి తల్లిదండ్రులుగా మారి దగ్గరుండి వేడుకలో పాల్గొన్నారు. వివాహమే కాదు.. తమ కుమారుడి ఇంటినీ కోడలికి రాసి ఇచ్చారు. ఎంతో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న యుగ్​ప్రకాశ్ దంపతులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

widowed daughter in law remarried
రెండో పెళ్లి వేడుక
widowed daughter in law remarried
ప్రియాంక రెండో వివాహం
widowed daughter in law remarried
ప్రియాంక్ తివారి- ప్రియాంక

ఇదీ చదవండి:

యువనటి మృతి.. భర్త అరెస్ట్.. పెళ్లయిన ఏడాదిన్నరలో ఏం జరిగింది?

యువతుల మధ్య లవ్​.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.