నేపాల్​లో భూకంపం.. దిల్లీలో భారీ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

author img

By

Published : Jan 24, 2023, 2:52 PM IST

Updated : Jan 24, 2023, 3:43 PM IST

delhi strong earthquake

దిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

దేశ రాజధాని దిల్లీలో స్వల్ప స్థాయి భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. మంగళవారం మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో దిల్లీ-ఎన్​సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూప్రకంపనలు రాగానే.. స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు ఇంట్లోని వస్తువులు కదిలిన దృశ్యాలను దిల్లీ వాసులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రకంపనల ధాటికి ఫ్యాన్లు, షాండ్లియర్‌ ఊగుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా.. దిల్లీలో భూమి కంపించడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. దిల్లీతో పాటు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.

delhi strong earthquake
భూకంప కేంద్రం

అయితే నేపాల్​లో సంభవించిన భూకంపం ధాటికి దిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం 2:28 గంటలకు సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో సంభవించింది.

Last Updated :Jan 24, 2023, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.