మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి.. మరోసారి 45వేలకు పైగా కేసులు

author img

By

Published : Jan 13, 2022, 8:37 PM IST

Updated : Jan 19, 2022, 8:07 AM IST

corona

covid cases in india: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్రలో మరోసారి 45వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. దిల్లీలో కొత్తగా 28వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు బంగాల్​, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా 20వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి.

Covid Cases in India: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజు 45వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 46,406 మందికి పాజిటివ్​ అని నిర్ధరణ కాగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 34,658 మంది కోలుకున్నారు.

ప్రాంతంకొత్త కేసులుమరణాలు
మహారాష్ట్ర46,40636
దిల్లీ28,86731
బంగాల్​23,46726
కర్ణాటక25,0058
తమిళనాడు20,91125
కేరళ13,468117
ముంబయి13,7026
గుజరాత్11,1765
రాజస్థాన్​9,8817
గోవా3,7284
చండీగఢ్​1,338-

జైలులో కొవిడ్​ కలకలం

తిహాడ్​ జైలులో కరోనా కలకలం రేపుతోంది. కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన ఖైదీల సంఖ్య 85కు చేరింది. మరోవైపు జైలు స్టాఫర్లలో కరోనా సోకిన వారి సంఖ్య ఈనెల 10 నాటికి 48గా ఉండగా ఇప్పుడు అది కాస్త 75కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం కరోనా సోకిన ఖైదీలు, స్టాఫర్లు క్వారంటైన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు.

30 మంది జవాన్లకు కరోనా

గుజరాత్​ పౌరీ జిల్లాలోని కొట్​ద్వార్​లో ఎలక్షన్​ డ్యూటీలో భాగంగా వచ్చిన బీఎస్​ఎఫ్​ జవాన్లలో 30 మందికి కరోనా సోకింది. పాజిటివ్​ వచ్చిన జవాన్లను ఐసోలేషన్​కు తరలించామని అధికారులు తెలిపారు.

అసోం గవర్నర్​కు కరోనా

అసోం, నాగాలాండ్​ గవర్నర్​ జగదీశ్​ ముఖీకు కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ అయింది. గవర్నల్​ ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు పంజాబ్ ఆమ్​ఆద్మీ ఎమ్మెల్యే అమన్​ అరోడాకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

ఒమిక్రాన్​ కేసులు

దేశవ్యాప్తంగా బుధవారం 1,94,720 కరోనా కేసులు బయటపడ్డాయి. కొవిడ్​ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్​ను జయించారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 76,32,024 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,54,61,39,465కు చేరింది.

ఇదీ చూడండి : 'ఒమిక్రాన్​ను సాధారణ జలుబుగా భావించవద్దు'

Last Updated :Jan 19, 2022, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.