ఫ్రెషర్స్​ పార్టీ తెచ్చిన తంటా.. మెడికల్ కాలేజీలో 182 మందికి కరోనా

author img

By

Published : Nov 26, 2021, 12:33 PM IST

Updated : Nov 26, 2021, 12:55 PM IST

Karnataka Medical College

కర్ణాటకలోని వైద్యకళాశాలలో(SDM College Covid News) కరోనా బారిన పడ్డ విద్యార్థుల సంఖ్య 182కు చేరింది. ఇప్పటివరకు 300 మందికి పైగా విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి తెలిపారు. కాలేజీలో ఇటీవల జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వెల్లడించారు.

కర్ణాటక, ధార్వాడ్​లోని ఎస్​డీఎమ్​ వైద్య కళాశాలలో కొవిడ్​-19(SDM college covid outbreak) బారిన పడిన విద్యార్థుల సంఖ్య 182 కు చేరింది.

కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారని వివరించారు. గురువారం మొత్తం 300 మందికి పైగా వైద్యపరీక్షలు నిర్వహించగా.. 66 మంది వైరస్ బారిన(Covid-19 karnataka) పడ్డారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 182కు చేరినట్లు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన వారిని క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపిస్తామన్నారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేసినట్లు తెలిపారు.

అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారే కావడం గమనార్హం. వీరెవరికీ కరోనా లక్షణాలు లేవు.

ఇదీ చూడండి: 11మంది ఉన్నతాధికారులకు కరోనా​.. ఒకరు పరార్​!

Last Updated :Nov 26, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.