'కరోనా మార్గదర్శకాలను పునఃపరిశీలించండి'

author img

By

Published : Sep 14, 2021, 5:12 AM IST

covid

కొవిడ్ మృతులకు చెల్లించే పరిహారంపై పునరాలోచించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. మహమ్మారి సోకిన సమయంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వబోమని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

కరోనా సోకిన వారు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లించాల్సిన పనిలేదంటూ రూపొందించిన మార్గదర్శకాలపై పునఃపరిశీలన చేయాలని సోమవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథమికంగా ఈ నిబంధనతో ఏకీభవించడం లేదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు చెప్పింది.

మరోవైపు మార్గదర్శకాల జారీలో కావాలనే కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ న్యాయవాది దీపక్‌ కన్సల్‌ దావా వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.