రాజీవ్​ గాంధీ హత్య కేసు దోషుల విడుదల.. సుప్రీంలో కాంగ్రెస్​ సవాల్​!

author img

By

Published : Nov 21, 2022, 4:07 PM IST

Updated : Nov 21, 2022, 4:53 PM IST

rajiv gandhi assassination

Rajiv Gandhi Assassination : రాజీవ్​ గాంధీ హత్య కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్​ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రివ్యూ పిటిషన్​ దాఖలు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

Rajiv Gandhi Assassination : రాజీవ్​ గాంధీ హత్య కేసులో దోషులను ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కాంగ్రెస్​ పార్టీ.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశలున్నాట్లు సమాచారం. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దోషుల విడుదలపై కాంగ్రెస్​ పార్టీ నుంచి వస్తున్న విమర్శలతో ఇటీవలే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల విడుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది.

rajiv gandhi assassination
రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులు శ్రీహరన్ అలియాస్​ మురుగన్, నళిని, సంథన్

అయితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్​ సహా మెత్తం ఆరుగురు దోషులు రవిచంద్రన్, సంథన్, రాబర్ట్​ పాయస్, జయకుమార్​లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు నవంబర్ 11న తీర్పు వెలువరించింది. కారాగారంలో దోషుల ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నందున శిక్ష తగ్గించాలని నిర్ణయించింది. దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Last Updated :Nov 21, 2022, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.