'దాచిపెట్టాల్సిందేమీ లేదు.. పారదర్శకంగానే అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తాం'

author img

By

Published : Sep 15, 2022, 9:57 PM IST

Congress President Election

Congress President Election : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తామని.. దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు పార్టీ కేంద్ర ఎన్నికల​ కమిటీ అధ్యక్షుడు మధుసూధన్​ మిస్త్రీ. సెప్టెంబర్​ 22న ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల చేస్తామని చెప్పారు.

Congress President Election : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తామని.. దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు పార్టీ కేంద్ర ఎన్నికల​ కమిటీ అధ్యక్షుడు మధుసూధన్​ మిస్త్రీ. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు వివిధ పీసీసీల నుంచి 10 మంది ప్రతినిధుల మద్దతుతో నామినేషన్​ దాఖలు చేయాలని సూచించారు. అన్ని పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 9,000 మంది పీసీసీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రతినిధులందరికీ పార్టీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగనుందని వివరించారు. ఐడెంటిటీ కార్డుపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని.. దానిపై ఫోటో లేని వారు.. ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20 తర్వాత ఓటర్​ లిస్ట్ అందుబాటులోకి పెడతామని వెల్లడించారు. బుధవారం.. ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించామని వివరించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్

  • నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 22
  • నామినేషన్ల ప్రారంభం: సెప్టెంబర్ 24
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : సెప్టెంబర్ 30
  • ఉప సంహరణ గడువు : అక్టోబర్​ 8
  • ప్రచార సమయం: అక్టోబర్​ 8- అక్టోబర్​ 16
  • ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక తేదీ: అక్టోబర్ 17
  • ఫలితాలు: అక్టోబర్​ 19

దేశంలోని అతిపురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్.. నాయకత్వ సంక్షోభంలో ఉంది. 2019 లోక్​సభ ఎన్నికల తర్వాత పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు. అయితే, పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్​లో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడిన 23 మంది సీనియర్ నేతలు.. సోనియాకు లేఖ రాశారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, పార్లమెంటరీ బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటకు పొక్కింది.

ఇవీ చదవండి; 200 అడుగుల బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి

మాజీ సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. కాన్వాయ్​పైకి ఏనుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.